శరీరంలో వేడిని పెంచే ఈ ఐదు ఆహారాలను వేసవిలో నివారించండి

lifestyweklwlw-sd.jpg

వేసవి తాపం భరించలేనప్పుడు, శరీరాన్ని చల్లబరచడానికి మండే ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి మనం కొన్ని ఆహార పదార్థాలను ఆశ్రయిస్తాము. వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. పుచ్చకాయ, దోసకాయ మొదలైనవి వేసవిలో తినడానికి మంచి ఆహారాలు. కానీ కొన్ని ఆహారాలు శరీరాన్ని చల్లబరచడానికి బదులుగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి శరీరంలో వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

ఈ జాబితాలో వేరుశెనగ మొదటి స్థానంలో ఉంది. వేరుశెనగ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన గింజలు. వేరుశెనగ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో వేరుశెనగను ఎక్కువగా తినకండి.

ఈ జాబితాలో క్యారెట్లు రెండవ స్థానంలో ఉన్నాయి. క్యారెట్‌లు పోషకాలు అధికంగా ఉండే కూరగాయ. ఇవి చలికాలంలో తినడానికి ఉత్తమమైన కూరగాయ అని తరచుగా చెబుతారు. విటమిన్ సీ, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే క్యారెట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

Share this post

scroll to top