దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది. NB 1.8.1, LF.7 ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. దేశంలోనూ కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. మే 12 నుంచి వారం వ్యవధిలోనే 164 కొత్త కేసులు నమోదయ్యాయి కరోనా కేసుల సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించింది ఏపీ ప్రభుత్వం. కాగా కోవిడ్ కేసుల నేపథ్యంలో ఈ నెల 21న అడ్వైజరీ జారీ చేసింది ప్రభుత్వం. కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించడంతో బహిరంగ సభలు, ర్యాలీలు, జనసమీకరణ చేపట్టొద్దని ఆదేశాలు ఇచ్చారు.
ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలపై బ్యాన్..
