మే నెల రాకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో జనం అల్లాడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోత వేడితో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వేసవి కాలంలో నిరంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అప్రమత్తంగా ఉండాలని వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యంగా హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం వేసవి కాలంలో కీరదోసకాయ రసం మీ ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కీరదోసలో నీటి కంటెంట్ తోపాటు ఎన్నో పోషకాలు దాగున్నాయి వేడి వాతావరణంలో మనం రోజూ దోసకాయ రసం ఎందుకు తాగాలి.
మెరుగైన హైడ్రేషన్: దోసకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది.. ఈ రసం సూర్యుని వేడి నుండి తప్పించుకోవడానికి గొప్ప మార్గంగా మారుతుంది. హైడ్రేషన్ అనేది వేసవిలో ఒక సాధారణ సమస్య ఇది అలసట తలతిరుగుటకు కారణమవుతుంది. దోసకాయ రసం తాగడం వల్ల శరీరంలో కోల్పోయిన ద్రవాలు తిరిగి భర్తీఅవుతాయి ఇవి రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచడంతోపాటు శక్తినిస్తాయి.
శరీరంపై శీతలీకరణ ప్రభావం: దోసకాయ సహజ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. వేసవి వేడిలో ఇది ఒక వరంలాంటిది. వడదెబ్బను నివారించడంలో చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో దీన్ని తాగడం అలవాటు చేసుకోవడం మంచిది.
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: దోసకాయ రసంలో హైడ్రేషన్ తో పాటు, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది కుకుర్బిటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో కూడా సమృద్ధిగా ఉంటుంది.
మెరుగైన జీర్ణక్రియ బరువు నియంత్రణ: కొన్నిసార్లు, వేయించిన స్నాక్స్ లేదా ఫ్రైలు, పలు ఆహారాలు జీర్ణక్రియను భారంగా చేస్తాయి. దోసకాయ రసంలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది. దీని డీటాక్సిఫైయింగ్ లక్షణాలు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. దీన్ని తిన్న తర్వాత, మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది.