తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోన్న వేళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుమల లడ్డూ వివాద ఘటనను సుప్రీంకోర్టు సుమోటో గా తీసుకుని విచారణ చేయాలని కోరారు. ప్రజ సమస్యలు అన్ని పక్కనపెట్టి లడ్డూ సమస్య మొదటికి వచ్చిందన్న ఆయన కమ్యూనిస్టులు భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు. అయితే, భక్తుల మనోభావాలను దెబ్బకోట్టి విధంగా పరిస్థితిలు వచ్చాయి. జగన్ రివర్స్ టెండర్లు పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం కలిగింది. అసలు ఎందుకు చెన్నై డైరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు. తక్కువ రేటుకు నెయ్యి వస్తుందని లడ్డూలో ఎక్కడలేని దరిద్రాలు కలిపి తినమని చేబుతారా బుద్దిలేదా అని ఫైర్ అయ్యారు.
కమ్యూనిస్టులు భక్తులకు దేవాలయాలకు వ్యతిరేకం కాదు..
