వజ్రాల విలువ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. విలువైన వజ్రాలు దొరుకుతున్నాయంటే ఎవరు వదులుకోరు. ఈ క్రమంలో వజ్రాల కోసం వేట మొదలుపెడతారు. అయితే ఇటీవల రాయలసీమలో కురిసిన వర్షాలతో పంట పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం జోరందుకుంది. దీంతో జనం జొన్నగిరి ప్రాంతానికి భారీగా వెళుతున్నారు ఓ రైతుకు వజ్రం దొరకడంతో ఆయన లక్షాధికారి అయ్యారని, తమ జీవితాలు కూడా టర్న్ అవుతాయనే ఉద్దేశంతో పక్క జిల్లాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు.
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని మద్దికెర, తుగ్గలి మండలాల పరిధిలోని గ్రామాలకు వజ్రాల కోసం చాలామంది వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఏపీ లోని కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఒకరికి అదృష్టం వరించినట్లు ప్రచారం జరుగుతోంది. మద్దికేర మండలం లో నిన్న ఒకరికి ఖరీదైన వజ్రం లభించినట్లు తెలుస్తోంది. ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.30 లక్షలు చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం.