బంగాళాఖాతంలో బ‌ల‌ప‌డిన అల్ప‌పీడ‌నం..

have-rain-25-.jpg

దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇటీవల వాతావరణ అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని, దీంతో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అయితే బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో సోమ, మంగళ, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురుస్తాయి.

Share this post

scroll to top