డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ పోస్టును రీసెంట్ గానే పోస్టు చేశాడు. అయితే తాజాగా చిరంజీవి కూడా శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇందులో శేఖర్ కమ్ములతో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ నోట్ కూడా రాసి ఇచ్చాడు. ఇందులో ఆల్ ది బెస్ట్ మై బాయ్ అని రాసి ఉంది. కింద చిరు సైన్ చేశారు. శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ఓ సుదీర్ఘమైన ట్వీట్ చేశాడు మెగాస్టార్.
మీ 25ఏళ్ల కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సున్నితమైన సినిమాలు తీస్తూనే అందులో ఒక సోషల్ మెసేజ్ ను కూడా ఇస్తున్నారు. అందుకే ఈ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మీ అద్భుతమైన ప్రయాణానికి నేను స్ఫూర్తి అని తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒక గొప్ప జర్నీకి నేను కారణం అయినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. మీరు మరో 25 ఏళ్లు ఇలాగే సున్నితమైన సినిమాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ మై బాయ్’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.