సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దు..

cm-cbn-16.jpg

సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దు అయింది. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దు అయింది. ఢిల్లీలో కాంక్లేవ్ ముగియగానే హైదరాబద్ కు చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నానికి నేరుగా ఏఐజీ ఆస్పత్రికి సీఎం చంద్రబాబు వెళతారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోనే ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్‌, జైశంకర్‌ ను కలుస్తారు. అనంతరం నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళతారు. కానీ ఇంతలోనే తన సోదరుడి విషయం తెలిసింది. దీంతో హైదరాబాద్‌ రానున్నారు బాబు.

Share this post

scroll to top