రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న లైంగింకదాడి ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామంధులు రెచ్చిపోతున్నారు. ఒక ఘటన మరవకముందే మరో ఘటన వెలుగు చూడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో తాజాగా దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిపై ఇలా దాడి చేయడంతో బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. నిందితుడిని పట్టుకొని అతనిపై విపరీతంగా దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
పోలీసుల అదుపులో నిందితుడు ఉండగా బాలిక బంధువులు పోలీస్ స్టేషన్ కి భారీ సంఖ్యలో చేరుకొని అక్కడ ఉన్న నిందితుడి గొంతు, ముఖం, కాళ్లు చేతులపై బ్లేడులతో దాడి చేశారు. ఆ దాడిలో షేక్ మీరావళి విపరీతంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. షేక్ మీరావళిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతడిని వదిలేస్తే ఊరుకునేది లేదని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారిని ఉరితీయాలని కోరుతున్నారు.