ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్..

rgv-28-1.jpg

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని ఆర్జీవీ పిటిషన్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని, ఇకపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ కోరారు. ఈరోజు ఆర్జీవీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. ఆర్జీవీ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Share this post

scroll to top