వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కర్నూల్ జిల్లాకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2017 మే 21న కృష్ణగిరి మండలంలో నారాయణరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మొత్తం 29 మంది సాక్షులను విచారించిన కోర్టు 11 మందిని దోషులుగా నిర్థారించి వారికి జీవితఖైదు, రూ.1000 చొప్పున జరిమానా విధించింది. మరో ఐదుగురిని నిర్దోష్టులుగా ప్రకటించి, విడుదల చేసింది.
2017 మే 21న రామకృష్ణాపురంలో వివాహానికి హాజరై వస్తుండగా కృష్ణగిరి సబ్ స్టేషన్ దగ్గర నారాయణరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు కాపుగాసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటనలో నారాయణరెడ్డి తో పాటు ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసులో 17 మంది నిందితులు కాగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా గతంలో నిందితుడిగా ఉండేవారు. అయితే అప్పట్లోనే ఆయన పేరును కోర్టు తొలగించింది. సుదీర్ఘకాలం విచారణ అనంతరం 11 మందికి శిక్ష విధించింది కోర్టు సాక్షాధారాలు రుజువు కాకపోవడంతో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది