టీడీపీ నేతల మధ్య మంత్రి సబిత సమక్షంలో విభేదాలు..

tdp-08.jpg

 పులివెందులలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో పులివెందుల టీడీపీలో విభేదాలు భగ్గు మన్నాయి. పార్టీ ఇన్చార్జ్ బీటెక్ రవి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిల మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో మంగవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఇరువర్గాలకు చెందినవారు బాహా బాహీకి దిగారు. మంత్రి సవిత సమీక్షలో బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి వర్గీయులు వివాదానికి దిగారు. వేదికపై కూర్చునేందుకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వెళ్లారు. దీంతో ఆయన వేదికపై ఉండ కూడదని బీటెక్ రవి వర్గీయులు గొడవకు దిగారు. రాంగోపాల్ రెడ్డి కిందికి దిగిపోవాలని నినాదాలు చేశారు. నియోజకవర్గంపై తామే ఆధిపత్యం చెలాయించాలని ఇరువర్గాల వారు గొడవకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో సర్వసభ్య సమావేశం యధావిధిగా కొనసాగింది.

Share this post

scroll to top