రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని నేడు మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా కలిసిన వైయస్ఆర్ సీపీ ఎంపీ గుమ్మ తనూజ రాణి గారు. పలు గిరిజన,మరియు రాష్ట్ర సమస్యలు రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జీవో నెంబర్ 3 పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక చట్టం ద్వారా అయినా గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని స్థానిక గిరిజనులకే కేటాయించాలి అని విజ్ఞప్తి చేసిన ఎంపీ.. కర్ణుడికి కవచ కుండలు ఎంత ముఖ్యమో గిరిజన ప్రాంతానికి జీవోనంబర్ 3 అత్యంత అవసరం అని, అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ పండించే మా గిరిజన రైతులకు ప్రయోజనం మాత్రం శూన్యం అని, అరుకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది దీనివలన మధ్యవర్తులు దళారులు లబ్ధి పొందుతున్నారు కానీ పండించిన రైతు నష్టపోతున్నాడు. కనుక ఒక గిరిజన కాఫీ సొసైటీ స్థాపించి ఉద్యోగ నియామకాలు గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయించి సొసైటీ ద్వారా కాఫీ కొనుగులు చేపడితే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్లు కూడ అవుతుంది అని రాష్ట్రపతి గారికి వివరించిన ఎంపీ తనూజా రాణి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది అని వైసీపీ పార్టీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి అని శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి అని ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది అని రాష్ట్రపతి గారికి వివరించడం జరిగింది సుమారు 15 నిమిషాలు సమయం కేటాయించిన రాష్ట్రపతి గారు చెప్పిన అంశాలు అన్ని ఆసక్తిగా ఆలకించారు. అలాగే సంబధిత మంత్రిత్వ శాఖలకు తను ఆదేశాలు ఇస్తాను మీరు కూడా ఒకసారి మంత్రులతో మాటాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయమని చెబుతూ.. చిన్న వయసులో ప్రజాసేవ చేసే అదృష్టం మీకు వచ్చింది కష్టపడి ప్రజాసేవ చేసి ప్రజలలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించిన రాష్ట్రపతి.
మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా కలిసిన వైయస్ఆర్ సీపీ ఎంపీ గుమ్మ తనూజ రాణి..
