ఇవాళ ఆస్పత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జ్..

vamsi-02.jpg

నారోగ్యంతో బాధపడుతున్న వల్లభనేని వంశీని వైద్యం కోసం ఆయూష్ ఆసుపత్రికి గత శుక్రవారం నాడు జైలు అధికారులు తరలించారు. పలు కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వంశీ శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా విజయవాడలోని ఆయూష్‌ హస్పటల్ లో చికిత్స చేయించాలని ఆదేశించింది. ఈ మేరకు విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. నేటితో చికిత్స ముగియడంతో డాక్టర్లు ఇవాళ వల్లభనేని వంశీని డిశ్చార్జ్ చేశారు. ఈ నెల 5వ తేదీన వంశీ ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టును సీల్డ్ కవర్ లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Share this post

scroll to top