బాబూ ఇంత ద్రోహమా..

ys-jagan-04.jpg

హామీల అమలులో అలసత్వం నిర్లక్ష్యం ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న  కూటమి ప్రభుత్వంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.  సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లును విస్మ‌రించిన చంద్ర‌బాబు స‌ర్కార్ తీరును వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ  ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు.

Share this post

scroll to top