నేడు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో వైయ‌స్‌ జగన్‌ భేటీ..

ys-j-07.jpg

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మరియు రీజనల్ కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు.  సందర్భంగా, వైఎస్ జగన్ రాబోయే రాజకీయ పరిస్థితులపై నేతలకు మార్గదర్శనం చేయనున్నట్లు సమాచారం. పార్టీ తీసుకునే దిశ, అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు, కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులంతా పటిష్టంగా ఉండేలా ఈ సమావేశం కీలకంగా మారనుంది.

Share this post

scroll to top