మరికాసేపట్లో తెనాలికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్..

ys-j-03.jpg

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో తెనాలికి చేరుకోనున్నారు. ఇటీవల పోలీసుల నడ్డిరోడ్డుపై యువకులను చితకబాదిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ జాన్ విక్టర్ను, అతని కుటుంబాన్ని పరామర్శించనున్నారు. జగన్ రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఐతానగర్కు భారీగా చేరుకుంటున్నారు. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరు యువకులపై బహిరంగంగా ఖాకీలు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. పైగా పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారని, గంజాయి బ్యాచ్ అంటూ రివర్స్లో ఆరోపణలకు దిగారు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు.

Share this post

scroll to top