విభజనలో మొదటి అంశం హోదానే..

shARMILA-23.jpg

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన కేటాయింపుల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఇది బడ్జెట్ కాదని ఎన్నికల మేనిఫెస్టో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లక్ష కోట్లు అడిగితే ఇచ్చింది రూ.15 వేల కోట్లేనా అని అన్నారు. పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. ఇది బడ్జెట్ కాదు ఎన్నికల మ్యానిఫెస్టో. ఏది పడితే అది చెప్పొచ్చు. ఏదైనా హామీ ఇవ్వొచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి. కాలపరిమితి ఉండాలి. ఇది పూర్తిగా మేనిఫెస్టో. చంద్రబాబు రూ.లక్ష కోట్లు కావాలని అడిగారు. నిజానికి ఏపీకి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉంది. కానీ బాబు అడిగింది కేవలం రూ.లక్ష కోట్లు మాత్రమే. 5 ఏళ్లకు రూ.5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదు. బడ్జెట్ లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారు. లైఫ్ లైన్ అన్నారు. ఫుడ్ సేఫ్టీ అన్నారు. ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరంకి ఎన్ని నిధులు ఇచ్చారు. కనీసం బాబుకి అయినా క్లారిటీ ఉందా? ఇది పూర్తిగా బీజేపీ మేనిఫెస్టో. అసలు మానేసి కొసరు అన్నట్లు ఉంది. ప్రత్యేక హోదా అనే అంశం ఊసే లేదు. విభజన హక్కులను గౌరవిస్తాం అన్నారు. విభజనలో మొదటి అంశం హోదా. అసలు విషయం పక్కన పెట్టి, ఇతర విషయాలు ఇస్తాం అంటున్నారు. ఒక్కో ఎంపీకి వెయ్యి కోట్ల చొప్పున 15 వేల కోట్లు ఇచ్చి కొనుక్కున్నట్లు ఇచ్చారా? విశాఖ రైల్వే జొన్ ఊసే లేదు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కావాలి. 2022 కల్లా దేశం మొత్తం పక్కా ఇండ్లు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మూడు కోట్ల ఇండ్లు అంటున్నారు. గత 10 ఏళ్లుగా ఆంధ్రను మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారు. 

Share this post

scroll to top