కూట‌మి పాల‌న‌లో తల్లికి నిల్ తండ్రికి ఫుల్.. 

kalyani-03.jpg

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో తల్లికి నిల్ తండ్రికి ఫుల్ అన్న చందంగా కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న సాగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రంలో స్కూల్‌ విద్యార్థుల డ్రాప్‌ అవుట్స్‌ పెరిగిపోయాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ‌రుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడారు.

తల్లికి వందనం పథకానికి చంద్ర‌బాబు స‌ర్కార్‌ ఎగనామం పెట్టడం దారుణం. ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నేత‌లు నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, బిడ్డ‌ల‌కు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Share this post

scroll to top