దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన గుడివాడ 12వ వార్డులో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు జీవితంలో ఏనాడైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. కనీసం సర్పంచ్తో కూడా రాజీనామా చేయించలేని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు.అవతలవారికి చెప్పే ముందు.. నీ దగ్గరున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజీనామాలను ఈక ముక్కతో ...
Read More »Tag Archives: ysrcp
బోగస్ బాబు.. బోగస్ సర్వేలు.. చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు
మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారన్నారు. పది రోజులకి ముందు సిఎం అయినా మహారాష్ట్ర సిఎంకు టాప్ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న సిఎం వైఎస్ జగన్కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్కి చిన్న మెదడు చిట్లిపోయిందని, త్వరలోనే మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలని అన్నారు. ఓవైపు కాంగ్రెస్కు మద్దతిస్తూనే.. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి అభ్యర్థికి మద్దతివ్వడం ...
Read More »పవన్కల్యాణ్ది వీకెండ్ ప్రజాసేవ: పేర్ని నాని
ప్లీనరీలో కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జోరువానలో తడిసి ముద్దవుతున్నా కూడా కార్యకర్తలు ప్లీనరీలో పాల్గొన్నారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాదని.. చెప్పిన హామీలనే కాదు.. చెప్పనివి కూడా సీఎం జగన్ అమలు చేశారన్నారు.విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విశ్వసనీయత, విలువలకు నిలువుటద్దంలా సీఎం జగన్ పాలన ఉందన్నారు. పవన్ కల్యాణ్ది ...
Read More »బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: జగన్
చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం జగన్ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. ...
Read More »పరిశ్రమలకు 70 శాతం విద్యుత్ సరఫరా : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పరిశ్రమలకు వారంలో అన్ని రోజులపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు, 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి అవకాశం కల్పించినట్లు విద్యుత్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 235 మిలియన్ యూనిట్ల నుంచి 186 మిలియన్ యూనిట్లకు తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు సరఫరాను పెంపొందించే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Read More »బాధ్యతల్ని స్వీకరించిన పలువురు మంత్రులు
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నూతన మంత్రి మండలి కొలువుదీరిన సంగతి తెలిసిందే. మంగళవారం పలువురు మంత్రులు ఆ శాఖల బాధ్యతల్ని స్వీకరించారు. సచివాలయం 2వ బ్లాక్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూజలు నిర్వహించి.. సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ, బిసి సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే విద్యాశాఖామంత్రిగా నియమితులైన బొత్ససత్యనారాయణ కూడా ఆ శాఖ బాధ్యతల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ దేవానందరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రవాణాశాఖామంత్రిగా పి. విశ్వరూప్ బాధ్యతలు చేపట్టారు.
Read More »రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : మంత్రి ఆళ్ల నాని
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)పేర్కొన్నారు. స్థానిక సాలిపేట సాయి సుధ హాస్పిటల్ ప్రక్కన డా.వాడ్రేవు రవి ఏర్పాటు చేసిన అధునాతన ఎ వాన్ రోగనిర్ధారణ కేంద్రం నూతన భవనంను మంత్రులు ఆళ్ల నాని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం ప్రారంభించారు. మూడు అంతస్తుల భవనంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన ఎమ్మార్ఐ, సిటీ స్కాన్ రెవల్యూషన్ ఏసీటీ, అల్ట్రా సౌండ్, ...
Read More »బద్వేలు ఉప ఎన్నికలో వైసిపి ఘన విజయం
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీ సాధించారు. గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో తన భర్త మెజారిటీ బీట్ చేశారు. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 89,660 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇంకా ఒక్క రౌండ్ మాత్రమే మిగిలి ఉండటంతో వైసీపీ గెలుపు లాంఛనమైపోయింది.
Read More »వైసిపి ఎంపి ఇంట్లో ఐటి తనిఖీలు
రాజ్యసభ సభ్యుడు, వైసిపి నేత అయోధ్య రామిరెడ్డి ఇంట్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాంకీ సంస్థల చైర్మన్గా అయోధ్య రామిరెడ్డి వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాంకీ సంస్థ చాలా ప్రాజెక్టులను నిర్వహించింది. ట్యాక్స్ చెల్లింపుల విషయంలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని 15 చోట్ల ఐటి సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మాదాపూర్లోని రాంకి ప్రధాన కార్యాలయంలోనూ, రాంకీ అనుబంధ సంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. సంస్థకు చెందిన కొంతమంది డైరెక్టర్ల ఇళ్లల్లోనూ ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఏఏ అంశాలు, దేనికి ...
Read More »9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై క్రిమినల్ కేసులు
కోవిడ్ చికిత్సలో అవకతవకలకు పాల్పడిన 9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై ఎపి సర్కార్ క్రిమినల్ కేసులను నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి 15 ఆసుపత్రులను తనిఖీ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా 9 ప్రైవేటు ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ… అవకతవకలకు పాల్పడిన తొమ్మిది ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కోవిడ్ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ ...
Read More »