రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 20న ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లోని 6 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఏపీలోని 3 స్థానాలు ఉన్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యల రాజీనామా ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ డిసెంబర్ 3న విడుదల అవుతుంది. డిసెంబర్ 10న నామినేషన్ దాఖలుకి చివరి తేదీ. నామినేషన్ ఉపసంహరణకి డిసెంబర్ 13 చివరితేదీ. డిసెంబర్ 20న పోలింగ్ జరుగగా, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్..
