వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ పనితీరు అద్భుతం..

rambabu-13-.jpg

తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అద్భుతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి,  గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశంసించారు. ఈరోజు గుంటూరులో జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్‌, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్‌రెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలతో పాటు  జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు.  వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. 

Share this post

scroll to top