చంద్రబాబు ప్రమాణస్వీకార వేడుక.. కిక్కిరిసిన జనం

cbn-rush-a.jpg

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసేపట్లో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రముఖులు తరలివస్తున్నారు. ఉదయం 11:27 గంటలకు ప్రమాణస్వీకార ముహూర్తం కాగా.. ఉదయం నుంచే జనం తరలివచ్చారు. ఉదయం 9 గంటలకే సభావేదిక కిక్కిరిసిపోయింది. చాలామంది సీట్లు లేక నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే సభావేదికపైకి వచ్చారు. ఆయనతో పాటు మరో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా సభా వేదికపై కనిపిస్తున్నారు.

Share this post