జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు..

janasena-07.jpg

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన పార్టీకే చెందిన ఓ నాయకుడుపై మండల అధ్యక్షుడు దాడి చేయడం చర్చగా మారింది. ఇక, పార్టీ నేతపై దాడి చేసిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినవిల్లి జనసేన నాయకుడు తొలేటి ఉమ పై రాత్రి మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడి చేశాడు. అర్ధరాత్రి మండల అధ్యక్షుడు రాజేష్ తోటు పలువురు వ్యక్తులు ఇంటిలోకి చొరబడి కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా జనసేన నాయకుడు ఉమ, అతని భార్య తీవ్ర గాయాలపాలయ్యారు. తలపై బలంగా కొట్టడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ కారును ధ్వంసం చేశారు ఉమ అనుచరులు ఈ దాడిలో ఉమ అనుచరులు కొంతమంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన పోలీసుల స్టేషన్‌ వరకు చేరడం రంగంలోకి దిగిన పోలీసుల జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ వాహనం ధ్వంసం ఘటనలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కాగా, నిన్న మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో జరిగిన మండలం స్థాయి సమావేశంలో ఇద్దరి మధ్య జరిగిన ఒక వాగ్వాదం చివరకు దాడికి దారితీసినట్టుగా తెలుస్తోంది.

Share this post

scroll to top