Tag Archives: hyderabad

నేడు హైదరాబాద్ లో మోదీ రోడ్ షో.. భారీ ఆంక్షలు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో బీజేపీ హైకమాండ్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పర్యటించారు. తాజాగా మరో రెండు రోజుల పర్యటన కోసం మోదీ ఈరోజు హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. ఈరోజు ఆయన మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది. ...

Read More »

హైదరాబాద్ నగరానికి మంచినీటి సమస్య లేకుండా చూడాలి – సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని సూచ‌న‌లు చేశారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించాల‌ని సూచ‌న‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని ...

Read More »

గోకుల్‌చాట్‌ యజమానికి కరోనా

హైదరాబాద్‌లో పేరుపొందిన కోఠి గోకుల్‌చాట్‌ యజమాని (72)కి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం సృష్టించింది. అధికారులు గోకుల్‌చాట్‌ను మూసివేయించడంతో పాటు 20 మంది సిబ్బందిని, కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పా జిటివ్‌ వచ్చిన యజమాని ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో వైద్య సిబ్బంది, పో లీసులు వివరాలు సేకరిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సంఖ్యలోనే ప్రజలు గోకుల్‌చాట్‌ రుచులను ఆస్వాదిస్తుం టారు. దీంతో ఎక్కువ మంది వివరా లు సేకరించాల్సి రావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గోకుల్‌చాట్‌లో కట్లెట్, పావుబాజి, కుల్ఫీ వంటి పదార్థాలను ఎక్కువ ...

Read More »

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మొదట తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు. 

Read More »

హైదరాబాద్ టు చెన్నై.. 650 కి.మీ. బైక్‌పై ఒంటరిగా వెళ్లిపోయిన హీరో అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్‌కు స్పోర్ట్స్, ప్రీమియం బైకులంటే ఎంతో మక్కువ. ఆయన దగ్గర చాలా స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి. రేస్ ట్రాక్‌పై ఆయన పోటీ కూడా పడ్డారు. రేసర్‌గా ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. చెన్నై రోడ్లపై అజిత్ స్పోర్ట్స్ బైక్‌లపై చక్కర్లు కొట్టిన ఎన్నో వీడియోలు, ఫొటోలు గతంలో బయటికి వచ్చాయి. అయితే, ఆయన ఇటీవల ఏకంగా హైదరాబాద్ నుంచి చెన్నైకి బైక్‌పై వెళ్లిపోయారట. ఈ విషయం ‘వాలిమయి’ సినిమా యూనిట్‌లో కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. ఈ సినిమాలో అజిత్ ...

Read More »

అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఆయన భార్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. మారుతీరావు రూమ్ డోర్ తీయకపోవడంతో సిబ్బంది బలవంతంగా తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆయన మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. ...

Read More »