దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన గుడివాడ 12వ వార్డులో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు జీవితంలో ఏనాడైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. కనీసం సర్పంచ్తో కూడా రాజీనామా చేయించలేని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు.అవతలవారికి చెప్పే ముందు.. నీ దగ్గరున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజీనామాలను ఈక ముక్కతో ...
Read More »Tag Archives: ycp
బోగస్ బాబు.. బోగస్ సర్వేలు.. చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు
మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారన్నారు. పది రోజులకి ముందు సిఎం అయినా మహారాష్ట్ర సిఎంకు టాప్ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న సిఎం వైఎస్ జగన్కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్కి చిన్న మెదడు చిట్లిపోయిందని, త్వరలోనే మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలని అన్నారు. ఓవైపు కాంగ్రెస్కు మద్దతిస్తూనే.. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి అభ్యర్థికి మద్దతివ్వడం ...
Read More »పవన్కల్యాణ్ది వీకెండ్ ప్రజాసేవ: పేర్ని నాని
ప్లీనరీలో కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జోరువానలో తడిసి ముద్దవుతున్నా కూడా కార్యకర్తలు ప్లీనరీలో పాల్గొన్నారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాదని.. చెప్పిన హామీలనే కాదు.. చెప్పనివి కూడా సీఎం జగన్ అమలు చేశారన్నారు.విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విశ్వసనీయత, విలువలకు నిలువుటద్దంలా సీఎం జగన్ పాలన ఉందన్నారు. పవన్ కల్యాణ్ది ...
Read More »జనసేన అధినేత పవన్పై కొడాలి నాని ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుడివాడ మండలం లింగవరంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని విరుచుకుపడ్డారు. ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అని నిలదీశారు. అంబేద్కర్ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి ...
Read More »పరిశ్రమలకు 70 శాతం విద్యుత్ సరఫరా : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పరిశ్రమలకు వారంలో అన్ని రోజులపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు, 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి అవకాశం కల్పించినట్లు విద్యుత్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 235 మిలియన్ యూనిట్ల నుంచి 186 మిలియన్ యూనిట్లకు తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు సరఫరాను పెంపొందించే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Read More »పార్లమెంట్లో సొమ్మసిల్లిపడిపోయిన వైసిపి ఎంపి
వైసిపి ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్లో సొమ్మసిల్లి పడిపోయారు. బిపి, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు.ఈ ఘటనపై సహచర ఎంపిలు వెంటనే స్పందించారు. స్ట్రెచర్ తెప్పించి ఆయన్నిస్థానిక రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసియులో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సంబంధిత వైద్యులు తెలిపారు.
Read More »బద్వేలు ఉప ఎన్నికలో వైసిపి ఘన విజయం
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీ సాధించారు. గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో తన భర్త మెజారిటీ బీట్ చేశారు. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 89,660 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇంకా ఒక్క రౌండ్ మాత్రమే మిగిలి ఉండటంతో వైసీపీ గెలుపు లాంఛనమైపోయింది.
Read More »వైసిపి నాయకులు జనాగ్రహ దీక్షలు
టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజు కూడా దీక్షలు జరుగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యే పద్మావతి, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ...
Read More »చిరంజీవి, నాగార్జున కోరడంతోనే ఆన్లైన్ టికెట్లు: రోజా
వైసీపీ పార్టీ, నగరి ఎమ్యెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సిఎం జగన్ అమలు చేస్తూన్నారని ఎమ్యెల్యే రోజా పేర్కొన్నారు. వాళ్ళ నిర్ణయం మేరకే సిఎం జగన్ ఆఅ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు చాలా భాథాకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతతో వదిలేస్తూన్నామని పేర్కొన్నారు ఎమ్యెల్యే రోజా. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కోడేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ కూండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు ...
Read More »రాష్ట్రీయం మండలి రద్దుపై వెనక్కి తగ్గేది లేదు
శాసనసమండలిని రద్దు చేయాలన్న తమ ప్రభుత్వ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మండలి రద్దు తీర్మానం అనేది ఎత్తుగడలో భాగంగా తమ ప్రభుత్వం చేయలేదన్నారు. మండలి వ్యవస్థ ఉండకూడదనేదే తమ ఉద్దేశ్యమమన్నారు. ప్రతిపక్షం శాసనమండలిని నవ్వలాటగా మార్చిందని, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. గవర్నర్ కోటాలో మండలికి ఎంపికయిన అభ్యర్ధుల ప్రమాణస్వీకారం సందర్భంగా సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More »