కాగజ్ నగర్​, నిజామాబాద్ లలో నేడు అమిత్ షా ఎన్నికల ప్రచారం

amitsha2.jpg

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తరపున నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. మొదట ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరంలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నాం 1:50 గంటలకు చేరుకుంటారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్​నగర్​కు మధ్యాహ్నాం 3:05 గంటలకు చేరుకోని.. ఆదిలాబాద్‌ కమలం పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోడెం నగేష్‌కు మద్దతుగా ఎస్పీఎం క్రికెట్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నాం 3:20 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 40 నిమిషాల పాటు సభలో ఉంటారు.

Share this post

scroll to top