సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి..!

Meenakshi-chowdary.jpg

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. తన అందాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది మీనాక్షి చౌదరి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. దాంతో ఇప్పుడు ఈ చిన్నదానికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే కోలీవుడ్ లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అక్కడ ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది .

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా సముద్రపు ఒడ్డున చీరకట్టుతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share this post

scroll to top