కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్..

cabinat-28.jpg

సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్​ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంత్రులంతా హాజరైన కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రివర్స్ టెండర్ విధానం రద్దు చేసింది కేబినెట్‌ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం లభించింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత పనులు చేపడుతోన్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం లభించింది.

Share this post