వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో వైయస్ జగన్ సమావేశం..
