నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ

modiu.jpg

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం తెలంగాణలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని నందూర్బార్లో ఉదయం 11:30గంటలకు ఓ బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 3:15గంటలకు మహబూబ్ నగర్ లోని ఎన్నికల సభకు హాజరవుతారు. అక్కడ్నుంచి తిరిగి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అనంతరం ఆయన ఒడిశాకు వెళ్తారు. భువనేశ్వర్ లో రాత్రి 8:30 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు.

Share this post

scroll to top