Monthly Archives: September 2021

మాస్ట్రో మూవీ రివ్యూ

హీరో నితిన్‌ మూవీలంటేనే రొటీన్‌కి భిన్నంగా ఉంటాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా.. నితిన్‌ విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నటించిన మూవీ మాస్ట్రో. ఈసినిమా సెప్టెంబర్‌ 17న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్‌ అంధాదున్‌ రీమేక్‌్‌గా తెరకెక్కింది. బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా నటించిన పాత్రలో నితిన్‌ నటించారు. బాలీవుడ్‌లో హిట్‌ కొట్టిన చిత్రం.. తెలుగులో దర్శకుడు మేర్లపాక గాంధీ ఎలా తెరకెక్కించారు? ప్రేక్షకులను అలరించిందో లేదో తెలుసుకుందామా? కథ అరుణ్‌ (నితిన్‌) ఓ అంధుడు. తన బాల్యంలో ...

Read More »

కొత్త సినిమాకి సమంత గ్రీన్‌ సిగ్నల్

ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది. మరోవైపు తమిళంలో విగేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఎస్‌ఆర్‌ ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌లో ఓ సినిమా ప్రాజెక్ట్‌ కోసం సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇతర వివరాలు చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

Read More »

మహేశ్‌ ఫ్యామిలీ ఇంట వినాయక నిమజ్జన వేడుకలు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఫ్యామిలీ ప్రతి ఏటా వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకుంటుంది. ఇంట్లో గణేశ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించి నిష్టగా పూజలు చేస్తారు. అయితే ఈ సారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు ఘట్టమనేని ఫ్యామిలీ. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు.మ‌ట్టి గ‌ణేషుడిని ఇంట్లోని తొట్టిలో నిమ‌జ్జ‌నం చేయ‌గా, ఆ కార్య‌క్రమంలో మ‌హేశ్‌, న‌మ్ర‌త‌, సితార‌, గౌత‌మ్ పాల్గొన్నారు.

Read More »

సైదాబాద్‌ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మంచు మనోజ్‌

సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారంపై హీరో మంచు మనోజ్‌ స్పందించాడు. మంగళవారం బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను మనోజ్‌ పరామర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అన్నాడు. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చాడు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలన్నాడు. 

Read More »

నటుడు ఉత్తేజ్ ఇంట తీవ్ర విషాదం

 నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఉత్తేజ్‌ను పరామర్శిస్తున్నారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌ కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె ...

Read More »

సాయిధరమ్‌తేజ్‌ శస్త్రచికిత్స విజయవంతం

మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ గత శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో తేజ్‌కు కంటి, ఛాతీ భాగంలో గాయాలతోపాటు.. కాలర్‌ బోన్‌ కూడా విరిగింది. ఆయనకు అపోలో ఆసుపత్రిలో వైద్యులు మెరుగైన చికిత్సనందిస్తున్నారు. ఆదివారం తేజ్‌కు కాలర్‌బోన్‌ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్టు వైద్యులు తెలిపారు. అలాగే సాయితేజ్‌ ఆరోగ్యాన్ని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు.

Read More »

బైక్ ఆక్సిడెంట్ లో సాయిధరమ్‌ తేజ్‌

బైక్‌ రైడింగ్‌ చేస్తూ మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం రాత్రి గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బైక్‌తో ఆయన కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ...

Read More »

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రాజీనామా!

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు ఇచ్చారు. కాగా, వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం వెనుక గల కారణాలు తెలియరాలేదు. విజయ్‌ రూపానీ 2016 నుంచి గుజరాత్‌ సిఎంగా ఉన్నారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది పాటు ఉంది. అయితే, బిజెపి అధిష్టానం ఆదేశాలతోనే ఆయన సిఎం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కొత్త నాయకత్వం ...

Read More »

హీరోయిన్‌గా ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె రంగ ప్రవేశం

ప్రముఖ దర్శకులు శంకర్‌ చిన్న కుమార్తె అదితీ శంకర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘అదితీ శంకర్‌కు స్వాగతం. ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు(అదితీ) గెలుచుకుంటావు’’ అన్నారు సూర్య. ‘‘అదితీని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ధన్యవాదాలు. ఫుల్‌ ప్రిపరేషన్‌తో వస్తున్న అదితీని ఆదరిస్తారనే ఆశిస్తున్నాను’’ అన్నారు శంకర్‌. ‘‘అవకాశం ...

Read More »

రామ్‌చరణ్‌, యశ్‌తో శంకర్‌ మల్టీస్టారర్‌!

శంకర్‌ సినిమాలు భారీగా ఉంటాయి. భారీ గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్‌ ఆయన స్పెషాలిటీ. ప్రస్తుతం ‘ఇండియన్‌’ సీక్వెల్‌ ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. ఈ సినిమా తర్వాత శంకర్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సూపర్‌స్టార్‌ రామ్‌చరణ్, కన్నడ స్టార్‌ హీరో యశ్‌ను హీరోలుగా పెట్టి ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం కోలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇదే హాట్‌ టాపిక్‌.

Read More »