Politics

మరో కీలక పరిణామం.. ఈరోజు రేవంత్ తో కడియం శ్రీహరి భేటీ అయ్యే అవకాశం

తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపటి క్రితం కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై శ్రీహరితో రేవంత్ చర్చించారు. వీరిద్దరూ ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్టు ...

Read More »

నేడు కర్నూల్‌ జిల్లాలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

కోడుమూరు నియోజక వర్గం పెంచికాల పాడు నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. మేమంతా సిద్ధం యాత్ర మూడో రోజుకి చేరింది. అయితే, మేమంతా సిద్దం అంటూ సీఎం జగన్‌ కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు. కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బస్సు యాత్ర కొనసాగనుంది. కాగా, మధ్యాహ్నాం రాళ్ల దొడ్డి వద్ద హాల్టింగ్‌.. భోజన విరామం తీసుకోనున్నారు సీఎం. తిరిగి సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

Read More »

ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రలోభాలపై ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా డబ్బు, బంగారం, వెండి, మద్యం, చీరలు, గిఫ్టు ఐటెమ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల అధికారులు దూకుడు పెంచారు. తాజాగా ఎన్నికల నిబంధనల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించారు. రామ్ మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా, ...

Read More »

జనసేనకు బిగ్ షాక్..

జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు మద్దతిచ్చిన జనసైనికులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని విడిచి పోవడానికి సిద్ధమవుతున్నారు. టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి వల్ల సీటు కోల్పోయిన పలువురు జనసైనికులు పక్క పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు. గత ఎన్నికల్లో ముమ్మిడివరం అసెంబ్లీకి పోటీ చేసిన పితాని బాలకృష్ణ మరల ముమ్మిడివరం టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి చెందిన దాట్ల బుచ్చిబాబు అసెంబ్లీ అభ్యర్థి గా ఖరారు కావడంతో పితానికి నిరాశ ఎదురైంది.

Read More »

చంద్రబాబు పై సజ్జల ఫైర్..!

చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కూటమి భాగంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు చంద్రబాబు ఇప్పించారని చెప్పుకొచ్చారు. కాగా, సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదు. ప్యాంట్రీ కారుపై కూడా అసత్య ప్రచారం చేశారు. అన్ని అనుమతులు తీసుకున్నా ప్యాంటీ కారుపై తప్పుడు ప్రచారం ...

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉప ఎన్నిక జరుగుతోంది. జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఓటింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.

Read More »

వయస్సులో నేను చాలా చిన్నోడిని’.. సీఎం జగన్

వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారని సీఎం జగన్ అన్నారు. బస్సు యాత్రంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో గురువారం సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారని వివరించారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. నా ...

Read More »

YS వివేకా హత్య వెనుక చంద్రబాబు, బీటెక్ రవి హస్తం: MLA రవీంథ్రనాధ్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై వైసీపీ ఎమ్మెల్యే రవీంథ్రనాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, బీటెక్ రవి, ఆది నారాయణ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యపై సీఎం జగన్ ఇచ్చిన వివరణ టీడీపీకి చెంప పెట్టులాంటిందని అన్నారు. కడప జిల్లా ప్రజలకు అసలు వాస్తవాలు ఏంటో తెలుసన్నారు. వివేకా హత్యపై సీఎం జగన్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలను అర్థం ...

Read More »

‘టైమ్స్ నౌ సమ్మిట్ 2024’లో సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద సరిపడా డబ్బు లేదని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ బీజేపీ నాయకత్వం కోరినా ఈ కారణంగానే తిరస్కరించానని ఆమె వెల్లడించారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారని తెలిపారు. అయితే వారం, పది రోజులు ఆలోచించి పోటీ చేయడం తన వల్ల కాదని నిర్ణయించుకున్నానని, అదే విషయాన్ని అధిష్ఠానానికి తెలిపానని ఆమె ...

Read More »

ఇవాళ కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇవాళ కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక జరగనుంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా ఆయన రాజీనామా చేశారు. ఈ తరుణంలో మహబూబ్నగర్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఇక ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ ...

Read More »