దసరా బరిలో మహాసముద్రం

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. అజరు భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఒక మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.