నా మనసు కలచివేస్తోంది : చిరు

అల్పపీడన ప్రభావం వల్ల.. తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదలతో.. అక్కడి స్థానికులు ఇబ్బందులు పడటం చూసి మెగాస్టార్‌ చిరంజీవి చలించిపోయారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘గతంలో ఎన్నడూ లేనంత వర్షాలు తిరుపతి, తిరుమలలో కురవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే నా మనసు కలిచివేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, టిటిడిలు సమిష్టి కృషి చేసి వరద ముప్పు నుంచి వారిని కాపాడాలి. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాలని కోరుతున్నాను’ అని ఆయన ట్వీట్‌ చేశారు.