సినిమా రంగంలో విశేష సేవలందించిన వారికి పద్మ అవార్డులు మంగళవారం కూడా రాజ్ భవన్ లో ప్రదానం చేశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు వరించిన విషయం విదితమే. ఎస్పీ తరుపున ఆయన కుమారుడు చరణ్ మంగళవారం ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. వీరితో పాటు గాయని చిత్ర కూడా పద్మభూషణ్ అందుకున్నారు. ఏక్తా కపూర్, కరణ్ జోహార్, అద్నాన్ సమీ, కంగనా రనౌత్ సోమవారమే పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు.