Monthly Archives: June 2021

కరోనాతో యాక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత!

నటుడు, సినిమాటోగ్రాఫర్‌ షమన్‌ మిత్రు (43) గురువారం చెన్నైలో కన్నుమూశారు. కోవిడ్‌ మహమ్మారి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ (డిఓపి)గా ఆయన పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. 2019లో తోరతి చిత్రంలో ఆయన గొర్రెల కాపరి పాత్రలో నటించారు. ఈ సినిమా గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గొర్రెల కాపరుల జీవితాలను ప్రతిబింబిస్తుంది. కాపరి పాత్రలో నటించాలంటే.. నటులు ఆ జీవనశైలికి తగ్గట్టుగా.. బరువు తగ్గాలి.. కొన్ని మైళ్ల దూరం గొర్రెల వెంట ...

Read More »

నాని నిర్మాణంలో ‘మీట్‌ క్యూట్‌’

వాల్‌ పోస్టర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై హీరో నాని నిర్మించిన అ, హిట్‌ వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాని నిర్మాణంలో మీట్‌ క్యూట్‌ అనే సినిమా రూపొందుతుంది. ఈ విషయాన్ని నాని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం..’ అంటూ మీట్‌ క్యూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ సినిమాలో సత్యరాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

Read More »

సమంతకు అన్ని కోట్ల రెమ్యునిరేషనా..!

సమంత వెబ్‌సిరీస్‌లోనూ రాణిస్తోంది. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మేన్‌ -2’ వెబ్‌ సిరీస్‌లో ఆమె నటించిన రాజీ పాత్రకు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె రాజీ పాత్రలో నటించినందుకు గాను, అమెజాన్‌ డిజిటల్‌ సంస్థ సమంతకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ ఇచ్చిందని టాక్‌ వినిపిస్తోంది. కాగా.. ఇప్పుడు తాజాగా ఆమె మరో వెబ్‌ సిరీస్‌లో నటించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌ను మరో డిజిటల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించబోతుందని తెలుస్తోంది. అందులో భాగంగా సదరు డిజిటల్‌ సంస్థ సమంతకు ...

Read More »

మెగాస్టార్ మీద కేంద్రమంత్రి ప్రసంశల వర్షం

మెగాస్టార్‌ చిరంజీవిపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిరంజీవి, ఆయన బందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌ రెడ్డి కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన చిరంజీవి ”మీ దయగల మాటలకు ధన్యవాదాలు. నేను చేయగలిగిన చిన్న సహాయం మాత్రమే చేస్తున్నా” అంటూ రిప్లై ఇచ్చారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఎంతోమంది రోగులు ...

Read More »

‘ఖిలాడి’ రీమేక్‌ చేయబోతున్న సల్మాన్‌

చాలాకాలంగా దక్షిణాది రీమేక్‌లతో బ్లాక్‌ బస్టర్లు హిట్లు కొడుతున్నారు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌. తాజాగా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్ర రీమేక్‌ హక్కులను ఆయన కొనుగోలు చేశారు. హిందీ వెర్షన్‌ కి కూడా రమేష్‌ వర్మనే డైరెక్ట్‌ చేయాలని ఆఫర్‌ చేశారని తెలుస్తోంది. ‘ఖిలాడీ’ టీజర్‌ నచ్చి, మేకర్స్‌్‌ ద్వారా కథ కూడా బావుందని తెలిసి హక్కులు కొనుగోలు చేశారని సమాచారం. ఇదివరకే రవితేజ నటించిన ‘కిక్‌’తో సల్మాన్‌ పెద్ద హిట్టు కొట్టాడు. ఇప్పుడు ‘ఖిలాడీ’ వర్కవుటవుతుందో లేదో చూద్దాం.

Read More »

పేద‌ల ఆక‌లి తీరుస్తోన్న రాశీఖ‌న్నా

కొవిడ్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆప‌న్నుల‌కు అండ‌గా నిలుస్తున్నారు హీరోయిన్ రాశీఖ‌న్నా. ఎంద‌రో సెల‌బ్రిటీలు పేద‌ల‌కు, ఇబ్బందుల్లో ఉన్న వారికి త‌మ వంతు సాయాన్ని అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరి బాట‌లోనే రాశీఖ‌న్నా కూడా అడుగు పెట్టారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నిలేక తిన‌డానికి తిండి లేకుండా ఇబ్బందులు ప‌డుతున్న వారికి ఆహారాన్ని అందించే ప‌నికి శ్రీకారం చుట్టారు. రోటీ బ్యాంక్ అనే స్వ‌చ్చంద సంస్థ‌తో క‌లిసి రాశీఖన్నా పేద‌ల‌కు త‌న వంతుగా తోడ్పాటును అందిస్తున్నారు. వాలంటీర్స్‌తో క‌లిసి వృద్ధాశ్ర‌మాల‌కు, రోడ్డుపై ఉండే జంతువుల‌కు ఆహారాన్ని ...

Read More »

ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దు..చిరంజీవి

కొరటాల శివ, మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్‌ ప్రభావంతో ఆలస్యమవుతూ వస్తోంది. చిన్నపాటి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉండగా..కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో దర్శకుడు చిత్రీకరణను నిలిపివేశాడు. ఇప్పుడు ప్రస్తుతం లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు రావడంతో చిత్రీకరణను మొదలుపెట్టాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉంది. ఇంకా 15 రోజులు షూట్‌ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేయాలని కొరటాలకు చిరు సూచించారు. హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌, పూజాహెగ్డే ...

Read More »

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పూర్తి చేసిన మహేష్‌బాబు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన తండ్రి కృష్ణ (మే 31) పుట్టిన రోజు సందర్భంగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమం బుధవారంతో ముగిసిందని.. గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రహాస్పిటల్స్‌ వారికి మహేష్‌ సతీమణి నమత్ర సోషల్‌మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికే ఎంతోమంది చిన్నారుల గుండె ఆపరేషన్‌కు సాయం చేసిన మహేష్‌… ఇప్పుడు ఎంతో బాధ్యతతో.. సొంత ఊరిలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయిడంచడం ...

Read More »

కరోనా పై రాజమౌళి షార్ట్‌ ఫిల్మ్‌

రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది. ఈ విరామ సమయంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేయిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి కరోనా వారియర్స్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ తీస్తున్నాడని తెలిసింది. ఈ చిన్న చిత్రం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖపై ఉండనుంది. కరోనా తో చనిపోయిన కొందరు పోలీసులతో పాటు డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులను, జనాలకు సాయం అందిస్తున్న వారిపై కూడా ఈ చిత్రం ఉండబోతోంది. దాదాపుగా 20 నిమిషాల పాటు ఉండే ఈ ...

Read More »

వెరైటీ టైటిల్‌తో అనుష్క సినిమా

హీరోయిన్‌ అనుష్క శెట్టి త్వరలో కొత్త సినిమాకి ఓ వెరైటీ టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. హీరో నవీన్‌ పొలిశెట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘మిస్‌ శెట్టి ..మిస్టర్‌ పొలిశెట్టి’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మహేశ్‌ దర్శకత్వం వహించనుండగా, యూవీ క్రియేషన్స్‌ నిర్మించనున్నారు. ఈ నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ‘నిశ్శబ్ధం’ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Read More »